ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించుకునేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనల మేరకు 3,155 మందిని ఒప్పంద విధానంలో, 1,201 మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు వీరిని నియమించనున్నారు. ఇందులో.. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి.
2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి అనుమతులిచ్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ నియామకాలకు ఏడాదికి రూ.634.48 కోట్ల మేర వ్యయం చేయనుందని తెలిపారు. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సత్వరమే నియామకాలు చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.