* అత్యధికంగా డీఎంఈలో 3,235 ఉద్యోగాలు
* ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఐఐపీఎం, ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, బయో మెడికల్, ఆడియో విజువల్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్లు సహా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్ నర్సులు, 1,014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.