సీఈసీకి అచ్చెన్నాయుడి లేఖ
ఈనాడు డిజిటల్, అమరావతి: డీఎస్సీ నిర్వహణ, టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులకు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలూ కోడ్ ఉల్లంఘనే అవుతాయంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్కు మార్చి 24న ఆయన లేఖ రాశారు. ‘‘మార్చి 22, 23 తేదీల్లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ.. వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కిపైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు. ‘‘ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫలితాల వెల్లడి... 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలి’’ అని అచ్చెన్నాయుడు కోరారు. ‘‘శ్రీరామనవమి సందర్భంగా కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామికి సంబంధిత మంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం, తితిదేలో న్యాయాధికారిగా పనిచేస్తున్న వై.వీర్రాజు డిప్యుటేషన్ కాలపరిమితి పొడిగింపు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి రూ.63.85 కోట్ల విడుదల, 50 బోధన, 68 సాంకేతిక సిబ్బంది నియామకం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోండి’’ అని ఆయన లేఖలో ప్రస్తావించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.