నర్సంపేట, న్యూస్టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 తరగతుల్లో అందుబాటులో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారన్నారు. ప్రవేశాలు, అర్హత ప్రమాణాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్.ఐఎన్లో ప్రాస్పెక్టస్లో చూసుకోవాలన్నారు. ఏప్రిల్ 4న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.