* మే 27 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను మే 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.
పాలీసెట్ మాక్ కౌన్సెలింగ్స్ |
‣ తెలంగాణ |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.