• facebook
  • whatsapp
  • telegram

JOSAA Counselling: ఈసారి ఐఐటీల్లో సీట్లు 17,740

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2024-25) మొత్తం 17,740 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీతో కలుపుకొని 17,385 సీట్లు ఉండగా ఈసారి 355 పెరిగాయి. మరో వైపు కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లోనూ సీట్లు పెరిగాయి. ఈసారి 121 విద్యాసంస్థల్లో సీట్లను 59,917 సీట్లను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ద్వారా భర్తీ చేయనున్నారు. జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి ప్రారంభమైంది.

ఐఐటీ తిరుపతి...ఎన్‌ఐటీ వరంగల్‌లో పెరిగిన సీట్లు

ఐఐటీ తిరుపతిలో గత ఏడాది 244 సీట్లుండగా... ఈసారి 10 మరో పెరిగాయి. మొత్తం సీట్లు 254కు చేరుకున్నాయి. అందులో 10 సీట్లతో నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఇక వరంగల్‌ ఎన్‌ఐటీలో 989 నుంచి 1049కి పెరిగాయి. కొత్తగా సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ డేటా సైన్స్‌) కోర్సును 60 సీట్లతో ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్లను 40 నుంచి 110కి పెంచారు. ఇక్కడ అంతకుముందున్న అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ సీఎస్‌ఈలో ఉన్న 40 సీట్లు కాస్తా 50కి చేరుకున్నాయి. కొత్తగా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌) బ్రాంచిని 60 సీట్లతో ప్రవేశపెట్టారు. ఐఐటీ గాంధీనగర్‌లో గత ఏడాదే 288 నుంచి 370కి పెరగగా... ఈసారి ఆ సంఖ్య 400కి చేరింది. ఐఐటీల్లో అగ్రగామి అయిన ఐఐటీ బాంబేలో 1356 నుంచి 1368, ధార్వాడ్‌లో 310 నుంచి 385, భిలాయ్‌లో 243 నుంచి 283, భువనేశ్వర్‌లో 476 నుంచి 496, ఖగర్‌పూర్‌లో 1869 నుంచి 1889కి, జోధ్‌పూర్‌ 550 నుంచి 600, పాట్నాలో 733 నుంచి 817కి, గువహటిలో 952 నుంచి 962కు సీట్ల సంఖ్య పెరిగింది. ఐఐటీ మద్రాస్‌లో మాత్రం ఈసారి ఆరు సీట్లు తగ్గడం గమనార్హం.
 



 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.