• facebook
  • whatsapp
  • telegram

NEET PG Exam: ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

నవంబరు తర్వాతే తరగతులు


 

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) జులై 5న  ప్రకటించింది. జూన్‌ 23న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా, నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఒక్క రోజు ముందు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు రీషెడ్యూల్‌ అయిన నీట్‌-పీజీ పరీక్ష కోసం విద్యార్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఎండీ, ఎంఎస్, మెడికల్‌ పీజీ డిప్లమా కోర్సుల్లో సీట్ల ఎంపిక కోసం ఆగస్టు 11న నీట్‌-పీజీ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈ ఏడాది పీజీ మెడికల్‌ కోర్సుల తరగతుల ప్రారంభంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. తాజా షెడ్యూలును బట్టి పీజీ తరగతుల ప్రారంభం నవంబరు లేదా అంతకంటే జాప్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా పీజీ విద్యాసంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా పీజీ విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. గతంలో కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిపాటు నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ప్రవేశ పరీక్షను సకాలంలో నిర్వహించకపోగా తరగతుల ప్రారంభం నవంబరు, డిసెంబరుకు చేరింది. కనీసం ఈ ఏడాది నుంచి అయినా నీట్‌-పీజీలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని అంతా భావించగా ఈసారి పరీక్ష నిర్వహణే గందరగోళంలో పడి తరగతుల ప్రారంభం యధావిధిగా నవంబరు తర్వాతకు మారనుంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.