* సాయంత్రం 4 గంటలకు విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు జూన్ 18న సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ఎ.అరుణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 20,626 మంది ఈ పరీక్షలు రాయగా నాలుగు రోజుల్లోనే ఫలితాలు ఇస్తుండటం విశేషం. ఫలితాలు ఈనాడు డాట్ నెట్, ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.