* 20 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 82,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో 69,728 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించారు. ఈ మేరకు పాలిసెట్-2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జూన్ 3న మధ్యాహ్నం విడుదల చేశారు. ఎంబైపీసీ విభాగంలో 68,301 మంది (82.48%) ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ 56 ప్రభుత్వ, 62 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 32,614 సీట్లు ఉండగా.. అందులో 65 శాతం మాత్రమే భర్తీ అవుతున్నాయని చెప్పారు. గత ఏడాది షాద్నగర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అందులో 240 సీట్లతో ఈసారి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించామని, ఇది రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల అని చెప్పారు. జూన్ 20వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే పూర్తిస్థాయి కాలపట్టికను జారీ చేశామని తెలిపారు. పాలిటెక్నిక్ తరగతులు జులై 18 నుంచి మొదలవుతాయని వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈసెట్ ద్వారా బీటెక్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తున్నట్లుగానే.. ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్లో రెండో ఏడాదిలో చేరేందుకు ఎల్పీసెట్ నిర్వహించినట్లు వెంకటేశం తెలిపారు. 895 మంది పరీక్ష రాస్తే 546 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.
ఎంబైపీసీ ర్యాంకుతో 3 రకాల కోర్సులకు అర్హత..
ఎంపీసీ విభాగంలో ర్యాంకుతో సాధారణ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్ డిప్లొమాలో చేరొచ్చు. ఎంబైపీసీ ర్యాంకుతో జయశంకర్ వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల పరిధిలోని పాలిటెక్నిక్ సీట్లలోనూ ప్రవేశాలు పొందొచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.