* ఈసెట్కు 36,369 మంది, ఐసెట్కు 44,446 మంది హాజరు
అనంతపురం(జేఎన్టీయూ), న్యూస్టుడే: పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్ - 2024 ఫలితాలను అనంతపురం జేఎన్టీయూలో మే 30న విడుదల చేస్తున్నట్లు ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. మే 8న ఈ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ఫలితాలను ఈనాడు ప్రతిభ.నెట్లో చూసుకోవచ్చు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ - 2024 ఫలితాలను మే 30న విడుదల చేస్తున్నట్లు సెట్ కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/icet/ , https://results.eenadupratibha.net/ ఈనాడు ప్రతిభ.నెట్ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.