• facebook
  • whatsapp
  • telegram

TGPSC: గ్రూప్‌-2, 3 పరీక్షల వాయిదా అవాస్తవం

* టీజీపీఎస్సీ స్పష్టీకరణ


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్‌మీడియా, వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ‘ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్‌ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్‌నోట్‌ సర్క్యులేట్‌ అవుతోంది. గ్రూప్‌-2 పరీక్షలు నవంబర్‌ 17, 18న, గ్రూప్‌-3 పరీక్షలు నవంబర్‌ 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరి నకిలీ వెబ్‌నోట్‌ సృష్టించి, వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు’ అని కమిషన్‌ పేర్కొంది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.