• facebook
  • whatsapp
  • telegram

TS TET: టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం

* ఎన్సీటీఈ మెంబర్ సెక్రటరీతో పీఆర్టీయూటీఎస్ నేతల భేటీ

ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మెంబర్ సెక్రటరీ కేసంగ్ యాంగ్జోమ్ షెర్పాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గురువారం పీఆర్టీయూటీఎస్ నేతలు.. కేసంగ్ను దిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతికి టెట్ ఉతీర్ణత తప్పనిసరి అయినందున ముందుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ అనంతరం టెట్ అర్హత పొందేందుకు ఐదు సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తామని కేసంగ్ హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూటీఎస్ నేతలు తెలిపారు.
 


♦ Click here for TET Model papers 


♦ Click here for Previous papers  


Some more information 

"Dreams to Reality: Yasir M.'s Inspirational Success Story"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.