‣ కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. మొత్తం తొమ్మిది రకాల కోర్సులను కొత్త విద్యాసంవత్సరం (2021-22) నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సిలబస్ను సైతం తయారు చేశారు. పాఠ్యప్రణాళికను జేఎన్టీయూహెచ్ ఆచార్యులకు ఇచ్చిన ఇంటర్ విద్యాశాఖ వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించి తగిన మార్పులు చేయనుంది. ‘భవిష్యత్తులో ఏ కోర్సు వారికైనా ఆయా సాంకేతికతలపై అవగాహన ఉండటం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.. ఉన్నత విద్యలో చేరినా అప్పటికే ఉన్న కొంత పరిజ్ఞానంతో సులభంగా నేర్చుకోగలుగతారు’ అని ఇంటర్ విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.
‣ కొత్త కోర్సులు ఇవీ..
1. కృత్రిమ మేధ, 2.మెషిన్ లెర్నింగ్,
3. రోబోటిక్స్, 4.బ్లాక్చైన్ టెక్నాలజీ,
5. అగ్మెంటెడ్ రియాలిటీ, 6.కోడింగ్,
7. ఎంబెడ్ సిస్టమ్,
8. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
9. ఇండస్ట్రియల్ ఆటోమేషన్
‣ మరికొన్ని విశేషాలు
* కోర్సును బట్టి కాలవ్యవధి 3 నెలల నుంచి 9 నెలల వరకు ఉంటుంది.
* కోర్సుల్లో 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీ భాగం ఉంటుంది.
* నామమాత్ర ఫీజు వసూలు చేస్తారు. ఇంటర్ విద్యార్థులు ఏ బ్రాంచీ వారైనా వాటిని ఎంచుకోవచ్చు.
* ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వీటిని అందుబాటులోకి తెస్తారు.
* భవిష్యత్తులో ఈ స్వల్పకాలిక కోర్సులను పూర్తికాల కోర్సులుగా మారుస్తారు. ప్రస్తుతం ఒకేషనల్లో 40 రకాల కోర్సులను అందిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.