• facebook
  • whatsapp
  • telegram

పది పరీక్షల నిర్వహణకే కర్ణాటక మొగ్గు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కరోనా తీవ్రత తగ్గకున్నా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం తీర్మానించింది. సురక్షిత వ్యవస్థల నడుమ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. జూన్‌ 25 నుంచి జులై 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు 8.40 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రవాణా, ఆరోగ్య, హోం శాఖల సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ లేకుండా చూస్తామని విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ జూన్ 10న‌ ప్రకటించారు. మాధ్యమిక విద్య (ఇంటర్‌) పరీక్షల్లో వాయిదా పడిన ఆంగ్ల పరీక్షను జూన్‌ 18న నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.