ఈనాడు, అమరావతి: 2018 నాటి గ్రూప్ 1 ప్రధాన పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ వేసిన అప్పీల్పై జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్.విజయ్తో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణ జరపనుంది. ఈ అప్పీల్పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దీంతో తమ అప్పీలుపై అత్యవసర విచారణ జరపాలని వేరే బెంచ్ ముందు ఏపీపీఎస్సీ తరఫు సీనియర్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ బెంచ్ ముందే తేల్చుకోవాలని జస్టిస్ రవినాథ్ తిల్హరి నేతృత్వంలోని ధర్మాసనం సూచించడంతో ఈ అప్పీల్పై రెగ్యులర్ బెంచ్ బుధవారం విచారణ జరపనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.