దిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్షల తేదీలను రీషెడ్యూలు చేసినట్లు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. గతంలో ప్రకటించినట్లుగానే పరీక్షలు మే నెలలోనే జరుగుతాయని కాకపోతే తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.
* గ్రూప్-1 కోసం నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను గతంలో మే నెల 3, 5, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా ఈ తేదీలను మే నెల 3, 5, 9 తేదీలకు మార్చారు.
* గ్రూప్-2 కోసం నిర్వహించే ఇంటర్మీడియేట్ పరీక్షలను మే నెల 9, 11, 13 తేదీల్లో బదులు మే నెల 11, 15, 17 తేదీల్లో నిర్వహిస్తారు.
* గ్రూప్-1 ఫైనల్ పరీక్షలను మే 2, 4, 8 తేదీలకు మార్చారు.
* గ్రూప్-2 ఫైనల్ పరీక్షలను మే 10, 14, 16 తేదీలకు మార్చారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.