ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. దీనికి 17,655 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,150 మంది పరీక్ష రాశారు. వారిలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి మొత్తం 12,032 మంది ఉత్తీర్ణులయ్యారని కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. తెలుగు మాధ్యమంలో బానోతు నవీన్ (77 మార్కులు), ఆంగ్లంలో వడ్ల వైష్ణవి (80 మార్కులు), ఉర్దూలో సుమైయా (71 మార్కులు) తొలి ర్యాంకులను దక్కించుకున్నారని తెలిపారు. ర్యాంకు కార్డులు జులై 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని శ్రీనివాసాచారి చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!