ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ను మే 16 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 13నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజు పోలింగ్ ఉన్నందున షెడ్యూల్ను సవరించారు. వ్యవసాయ, ఫార్మసీ అభ్యర్థులకు 16, 17 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు 18, 19న ఒక్కో విడత చొప్పున నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ 22వరకు కొనసాగుతుంది. ఏపీ పీజీసెట్ షెడ్యూల్నూ సవరించారు. మొదటి షెడ్యూల్ ప్రకారం జూన్ 3 నుంచి ప్రారంభం కావాలి. దీన్ని జూన్ 10కి మార్చారు. 14వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీ ఆర్సెట్ను మే 2 నుంచి 5వరకు నిర్వహించనున్నారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.