ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రయోగం విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. దేశ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) 3, 6వ తరగతి పాఠ్యపుస్తకాలను మార్పు చేస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత సిలబస్నే అమలు చేసేందుకు సిద్ధమైంది. పాత సిలబస్తో కూడిన పుస్తకాల ముద్రణకు ఆర్డర్లు ఇచ్చేసింది. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనూ సీబీఎస్ఈ సిలబస్నే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత పుస్తకాలనే కొనసాగిస్తామంటోంది. ఎక్కడైనా మారిన పాఠ్యంశాలను పిల్లలకు బోధిస్తారు. ఇక్కడ విద్యాశాఖ మాత్రం అంతా రివర్స్లో వెళ్తోంది. సమయం లేదంటూ 3, 6 తరగతులకు పాత పుస్తకాలనే ముద్రణకు ఇచ్చేస్తోంది. భవిష్యత్తులో మిగతా తరగతుల పుస్తకాలను మార్పు చేయనున్నట్లు ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఆరో తరగతి చదివే వారు పాత పుస్తకాలు చదివి.. వచ్చే ఏడాది ఏడో తరగతిలో కొత్త పుస్తకాలు చదవాల్సి వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
పుస్తకాలు లేకుండానే..
సీబీఎస్ఈ పాఠశాలలు మార్చి నెలలోపు పరీక్షలు పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. ఈ ఏడాది తొమ్మిదో తరగతి పూర్తి చేసిన వారికి ఏప్రిల్ నెలలోనే పదో తరగతి బోధించాల్సి ఉంటుంది. మిగతా తరగతుల్లోనూ ఇదే విధానం పాటించాలి. ఇంతవరకు పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తి కాలేదు. పుస్తకాలు లేకుండానే తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. దాదాపు నెల రోజులపాటు పుస్తకాలు లేకుండా చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది వెయ్యి పాఠశాలల విద్యార్థులు సీబీఎస్ఈలో పదో తరగతి పరీక్షలు రాస్తారంటూ రెండేళ్లుగా ప్రచారం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి పుస్తకాలు అందించాలనే ఆలోచన లేకుండాపోయింది. ఉపాధ్యాయులకు ఎన్సీఈఆర్టీ వెబ్సైట్ నుంచి పీడీఎఫ్లు డౌన్లోడ్ చేసి ఇస్తామంటోంది. ఆన్లైన్లో ఇచ్చే పీడీఎఫ్లతో బోధన ఎలా చేస్తారు? పుస్తకాలు లేకుండా ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.