• facebook
  • whatsapp
  • telegram

Latest News: 10-07-2024  తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Group-4: గ్రూప్‌-4  వినికిడి లోపం ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

గ్రూప్‌-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు..జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్‌ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Jobs: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తుకు సీనియర్‌ రెసిడెంట్‌లకు అవకాశం 

రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2023 బ్యాచ్‌ సీనియర్‌ రెసిడెంట్‌లకు అనుమతి ఇస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Counselling: 11 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ జులై 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Education: వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించుకోవాలి

వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో జులై 9న  అధికారులతో వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. RBI: 2023-24లో 4.7 కోట్ల ఉద్యోగాలు: ఆర్‌బీఐ

దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 4.7 కోట్ల కొత్త ఉద్యోగాలు జత కావడంతో.. మొత్తం 27 రంగాల్లో కలిపి ఉద్యోగుల సంఖ్య 64.33 కోట్లకు చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.