* వెల్లడించిన ఎన్టీయే
దిల్లీ: నీట్-యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస (ఎన్టీయే) శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యారుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. గత నెల్లో నీట్-యూజీ 2024 ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీయేను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.