ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా పెంచింది. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200 రుసుము ఉండగా... దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా.. దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్కు సంబంధించిన సమాచార పత్రాన్ని మార్చి 22న విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది. టెట్-2024 కోసం మార్చి 15న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 27 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు https://schooledu.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మే 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలను మే 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపింది. పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదలవుతాయని పేర్కొంది. అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే రూ.వెయ్యి, రెండు పేపర్లూ రాస్తే రూ.రెండు వేలు చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. టెట్ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది.
టెట్ పేపర్ 1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.
టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.