* సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తుకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి జారీచేసిన ఉద్యోగ ప్రకటన దరఖాస్తు గడువు మార్చి 13తో ముగియనుంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న కమిషన్ మార్చి 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి చేయాలని... కొత్తగా విద్యార్హత పొందిన ఉద్యోగార్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. అయితే మార్చి 13 వరకు 2.70 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్కు 3.80 లక్షల మంది అప్లై చేశారు. గతంలోనూ చివరిరోజున భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈసారి కూడా అలాగే జరగవచ్చని టీఎస్పీఎస్సీ అంచనా వేస్తోంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-I స్క్రీనింగ్ టెస్ట్
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.