• facebook
  • whatsapp
  • telegram

TSSP: టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల శిక్షణకు కసరత్తు

* మార్చి లేదా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. మార్చి లేదా  ఏప్రిల్‌ మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 2022 ఏప్రిల్‌లో 15,644 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా ఇందులో 5,010 పోస్టులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లవి. ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సివిల్‌, ఏఆర్‌, ఎస్‌పీఎఫ్‌ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో 12వేల మంది శిక్షణకు మాత్రమే మైదానాలు, వసతి సదుపాయాలు ఉండటంతో వీరి శిక్షణను వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాషబిస్త్‌ తెలిపారు.
 

ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. మార్చి లేదా  ఏప్రిల్‌ మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 2022 ఏప్రిల్‌లో 15,644 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా ఇందులో 5,010 పోస్టులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లవి. ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సివిల్‌, ఏఆర్‌, ఎస్‌పీఎఫ్‌ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో 12వేల మంది శిక్షణకు మాత్రమే మైదానాలు, వసతి సదుపాయాలు ఉండటంతో వీరి శిక్షణను వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాషబిస్త్‌ తెలిపారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.