* కొందరు మూడు, నాలుగు పోస్టులకు ఎంపిక
* ఏదో ఒకదాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా.. ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులను బ్యాక్లాగ్గా చూపుతున్నారు. దీంతో అవి దీర్ఘకాలికంగా ఖాళీగా ఉంటున్నాయి. దీన్ని మార్చాలని.. అలా మిగిలినవి మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
గురుకులాల్లో నాలుగువేలకుపైగా..
ప్రస్తుతం ఉన్న నియామక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయవచ్చు. యువత పోలీసు నియామకాల్లో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింట్లో అర్హత సాధిస్తున్నారు. తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, పీజీటీ, టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుని ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 9,210 ఖాళీల్లో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఎంపికైన వారికి 21 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామకపత్రాలను అధికారులు అందజేస్తున్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి.. చివరికి భర్తీకాని స్థానంగా పేర్కొంటున్నారు. సాధారణంగా రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగ్గా పేర్కొంటూ తదుపరి నియామకాలకు(క్యారీఫార్వర్డ్) పంపించే విధానం మొదట్లో ఉండేది. ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లోనూ ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండీ వారికి అన్యాయం జరుగుతోందనే భావన అభ్యర్థుల్లో ఉంది. గత పదేళ్లలో 8 వేల పోస్టులు బ్యాక్లాగ్లు ఏర్పడగా అందులో 5 వేలకుపైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లేనని తెలుస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.