• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 27-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  18వ పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
దేశ ప్రజలు మన ప్రజాస్వామ్యంపై, ఎన్నికల వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసాన్ని అన్నివేళలా వ్యక్తం చేశారని, దీనిని పరిరక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని మున్ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి భారత్‌ !
టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు.. 56.61 శాతం
తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పత్తి 50,48,904 ఎకరాలకు గాను 28,58,337 (56.61 శాతం) ఎకరాల్లో పంట వేశారని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

4.  రాజ్యసభాపక్ష నేతగా జె.పి.నడ్డా నియామకం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువసభ 264వ సెషన్‌ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  అరుంధతీ రాయ్‌కు పెన్‌ పింటర్‌ పురస్కారం
నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకుగానూ బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌కు పెన్‌ పింటర్‌-2024 పురస్కారం దక్కింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.