* వివరాలు కోసం క్లిక్ చేయండి
![]() |
AP EAPCET: ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇటీవల తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు జులై 17న (బుధవారం) మొదటి రౌండ్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు AP EAPCET హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అలాట్మెంట్ ఆర్డర్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.