• facebook
  • whatsapp
  • telegram

Engineering Counseling: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లోనూ రివర్స్‌

ఈనాడు, అమరావతి: అన్నింటిలోనూ రివర్స్‌ విధానం పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను అదే బాటలో నిర్వహిస్తోంది. ఇది వరకు కన్వీనర్‌ కోటా తర్వాత స్పాట్‌ కేటగిరి సీట్లు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు స్పాట్‌ తర్వాత కన్వీనర్‌ కోటా చేపట్టింది. ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం  నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. నవంబరు 6 నుంచి వెబ్‌ఐచ్ఛికాలకు అవకాశం కల్పించనుంది. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కలిపి 27 వేల వరకు సీట్లు ఉండగా.. వాటిలో ఎక్కువగా మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ సీట్లే ఉన్నాయి. ఇంజినీరింగ్‌కు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కల్పిస్తారు. కన్వీనర్‌ కోటాలో సీట్లు మిగిలితే కళాశాలల యాజమాన్యాలు స్పాట్‌ కోటా కింద భర్తీ చేసుకుంటాయి. ఈ ఏడాది ప్రభుత్వం రెండు విడతలు మాత్రమే నిర్వహించి, మిగిలిన సీట్లను స్పాట్‌ కింద భర్తీ చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. దీంతో యాజమాన్యాలు స్పాట్‌ కేటగిరిలో భర్తీ చేసుకున్నాయి. ఇప్పుడు విద్యార్థుల నుంచి డిమాండ్‌ వస్తుందంటూ ఎక్కడా సీట్లు రాని వారి కోసం మూడో విడత చేపట్టింది. మొదటి విడతలో ప్రవేశాలు పొందినవారికి సెప్టెంబరు మొదటి వారం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తరగతులు పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు మూడో విడతలో ప్రవేశాలు పొందినవారు అభ్యసనలో

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.