* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్యూటీఎఫ్ వినతి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) స్పష్టంచేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పరీక్ష నిర్వహించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు. మల్టీ జోన్-1లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు అందరినీ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేసి, ఆ ఖాళీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిసెంబరు 21న ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఎస్సీఈఆర్టీలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని టీపీటీఎఫ్ విన్నవించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఫారిన్ సర్వీస్, వర్క్ డిప్యుటేషన్, ఓరల్ డిప్యుటేషన్ పేరుతో అర్హత లేని కొంత మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారు విద్యా వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా పదోన్నతులు లేక ఒకేస్థాయిలో సేవలందిస్తున్న భాషా పండిత వ్యవస్థను రద్దు చేయాలని, తొలిమెట్టు, ఉన్నత కార్యక్రమాలను కూడా నిలిపివేయాలని ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి క్రాంతికృష్ణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.