* ప్రతి శని, ఆదివారాల్లో ‘నాటా’
* ఏప్రిల్ నుంచి జులై వరకు ఆన్లైన్ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) కోర్సులో చేరేందుకు నిర్వహించే పరీక్షా విధానంలో ఆర్కిటెక్చర్ కౌన్సిల్ పలు కీలక మార్పులు చేసింది. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జులై వరకు ప్రతి శని, ఆదివారాలు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) నిర్వహిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఈ విధానాన్ని అమలుచేయనుంది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తాజాగా సమాచార పత్రం(బ్రోచర్) విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా మూడు సార్లు నాటా రాసుకోవచ్చు. అందులో ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. అభ్యర్థులు పొందిన స్కోర్కు రెండేళ్ల పాటు గుర్తింపు ఉంటుంది. అంటే ఇప్పుడు పొందిన స్కోర్తో 2024-25 విద్యాసంవత్సరంలో గానీ, 2025-26లో గానీ సీటు పొందొచ్చు. పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఆర్కిటెక్చర్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.