• facebook
  • whatsapp
  • telegram

Education: ఇన్‌స్పైర్‌ మనక్‌ నమూనాల అప్‌లోడ్‌ గడువు 18

* ఈసారి ఆన్‌లైన్‌లోనే ప్రదర్శనలు

* ఉమ్మడి జిల్లాలో 337 నమూనాల ఎంపిక

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టి భావి శాస్త్రవ్తేతలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏటా ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పోటీలు నిర్వహిస్తోంది. 2022-23 ఏడాదికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేసి విద్యార్థుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఇక జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయాల్సి ఉంది. గత నవంబరులో పోటీలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. సమయాభావం వల్ల ఈ సారి ఆన్‌లైన్‌లో ప్రదర్శన ఇవ్వాలని ఆదేశాలు అందాయి. జ‌న‌వ‌రి 18లోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమూనాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది.
 

షెడ్యూల్‌


జ‌న‌వ‌రి  2 నుంచి 18 వరకు యాప్‌లో ప్రాజెక్టు వివరాల నమోదు. 19 నుంచి 25 వరకు మూల్యాంకనం. 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం.  ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు మూల్యాంకనం. అనంతరం జాతీయ స్థాయి జాబితా విడుదల.
 

రూ.10 వేల చొప్పున ఖాతాల్లో జమ


వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ఏటా ఉమ్మడి జిల్లా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో నూతన ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. గతేడాది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 337 నమూనాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. పరిశోధన నమూనాకు అవసరమైన సామగ్రి ఇతర అవసరాల కోసం రూ.10 వేలు విద్యార్థి ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బుతో పరిశోధన నమూనాలు తయారు చేసి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.
 

ముగ్గురు న్యాయ నిర్ణేతలు


ఆన్‌లైన్‌ పోటీల్లో ఉత్తమ పరిశోధనల ఎంపికకు ముగ్గురు సభ్యుల బృందం పర్యవేక్షిస్తుంది. జాతీయ ఆవిష్కరణ సంస్థ(నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌) నుంచి ఒకరు, జిల్లాకు చెందిన ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. నిర్దేశిత తేదీల్లో ముగ్గురు ఆన్‌లైన్‌లోనే పరిశోధనలు పరిశీలిస్తారు. ప్రతి నమూనాకు పది చొప్పున మార్కులుండగా ప్రతిభ ఆధారంగా కేటాయించనున్నారు. ప్రతి జిల్లాలో ఎంపికైన నమూనాల్లో పది శాతం మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి ఉంటుంది.


కొవిడ్‌ తర్వాత మళ్లీ ఆన్‌లైన్‌లో..


జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆలోచనలను ఎంపిక చేసి జిల్లాలకు పంపారు.  

కొవిడ్‌ కారణంగా రెండేళ్ల కిందట ఆన్‌లైన్‌లో ప్రదర్శనలు ఏర్పాటు చేయగా మళ్లీ ఈసారి అదే విధానం కొనసాగుతోంది.

* ఒక్కో విద్యార్థికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించారు.  

* విద్యార్థి సమగ్ర వివరాలతో యాప్‌లో లాగిన్‌ కావాలి.  

* ప్రాజెక్టు వీడియో, ఆడియో, ఫొటోలను నిక్షిప్తం చేయాలి.

* వీడియో నిడివి 2 నిమిషాలు, డాటా 30 ఎంబీ దాటకూడదు.

* మరోసారి అన్ని వివరాలను సరిచూసుకుని అప్‌లోడ్‌ చేసుకోవాలి.
 

సాంకేతిక సందేహాల నివృత్తి
 

ఇన్‌స్పైర్‌ మనక్‌లో ఎంపికైన విద్యార్థుల నమూనాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయం చేసుకొని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలపై అనుమానాలుంటే నివృత్తి చేస్తాం.
 

 -మాధవి, జిల్లా విద్యాధికారి, పెద్దపల్లి


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.