చొప్పదండి, న్యూస్టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 20న ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. 80 సీట్లకుగాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7105 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టికెట్లను అంతర్జాలం ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ప్రత్యేక సహాయ నంబర్లలో 94903 95216, 99667 59402, 90304 26686 సంప్రదించాలని కోరారు. దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే జనవరి 16లోగా విద్యాలయంలో సంప్రదించి సరి చేసుకోవాలని కోరారు. సీట్ల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.