• facebook
  • whatsapp
  • telegram

Exams: ప్రవేశ పరీక్షలకు త్వరలో కన్వీనర్ల నియామకం  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు రకాల ప్రవేశ పరీక్షల్లో కొన్నింటికి కొత్త కన్వీనర్లను నియమించనున్నారు. గత ఏడాది ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా పనిచేసిన ఓయూ విద్యా విభాగం ఆచార్యుడు రామకృష్ణ పదవీ విరమణ పొందటంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించడం అనివార్యం. ప్రొఫెసర్‌ స్థాయి వారినే కన్వీనర్‌గా నియమించాలి. ఓయూలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరిని నియమించాల్సి ఉంది.

* ఐసెట్‌ నిర్వహణకు పోటీ

తమకు మేనేజ్‌మెంట్‌ విభాగంతో ఎంసీఏ కోర్సు కూడా ఉన్నందున ఐసెట్‌ నిర్వహణ తమకు అప్పగించాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం  కోరుతోంది. అదే సమయంలో అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐసెట్‌ను కాకతీయ వర్సిటీ నిర్వహిస్తోంది. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నందున ఎంసెట్‌ పేరు మార్పు, ఇతర అంశాలపై చర్చించిన తర్వాతే కన్వీనర్లు, ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తారని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎంతో సమావేశం ఉంటుందని భావిస్తున్నారు.
 



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్‌’ కోర్సులు

‣ ఎన్‌సీఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులు

‣ ‘సాయ్‌’లో కోచ్‌ కొలువులు

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.