ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు రకాల ప్రవేశ పరీక్షల్లో కొన్నింటికి కొత్త కన్వీనర్లను నియమించనున్నారు. గత ఏడాది ఎడ్సెట్ కన్వీనర్గా పనిచేసిన ఓయూ విద్యా విభాగం ఆచార్యుడు రామకృష్ణ పదవీ విరమణ పొందటంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించడం అనివార్యం. ప్రొఫెసర్ స్థాయి వారినే కన్వీనర్గా నియమించాలి. ఓయూలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరిని నియమించాల్సి ఉంది.
* ఐసెట్ నిర్వహణకు పోటీ
తమకు మేనేజ్మెంట్ విభాగంతో ఎంసీఏ కోర్సు కూడా ఉన్నందున ఐసెట్ నిర్వహణ తమకు అప్పగించాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కోరుతోంది. అదే సమయంలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐసెట్ను కాకతీయ వర్సిటీ నిర్వహిస్తోంది. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నందున ఎంసెట్ పేరు మార్పు, ఇతర అంశాలపై చర్చించిన తర్వాతే కన్వీనర్లు, ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తారని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎంతో సమావేశం ఉంటుందని భావిస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.