* ప్రశ్నపత్రాల తీరుపై విద్యార్థుల ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్లో ప్రశ్నపత్రాల్లో తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జనవరి 27వ తేదీ నుంచి జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 29వ తేదీన రెండు మూడు ప్రశ్నలు తొలగించిన పాఠ్యాంశాల నుంచి రాగా...జనవరి 30 జరిగిన రెండు విడతల్లో ఒక్కో దాంట్లో మూడు నాలుగు వచ్చాయని నిపుణులు తెలిపారు. ఆ తొలగించిన సిలబస్ మాత్రం జేఈఈ అడ్వాన్స్డ్లో ఉంటుంది. అందువల్ల అడ్వాన్స్డ్ లక్ష్యంగా సిద్ధమయ్యే వారు మాత్రం తీసేసిన పాఠ్యాంశాలను కూడా చదువుతారని, వారికి ఇబ్బంది లేకున్నా మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రంలో ఎక్కువగా ఇస్తున్నారని జేఈఈ నిపుణులు ఉమాశంకర్, కృష్ణ చైతన్య తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.