• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌లో సిలబస్‌లో లేని ప్రశ్నలు  

* ప్రశ్నపత్రాల తీరుపై విద్యార్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో ప్రశ్నపత్రాల్లో తొలగించిన సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జనవరి 27వ తేదీ నుంచి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 29వ తేదీన రెండు మూడు ప్రశ్నలు తొలగించిన పాఠ్యాంశాల నుంచి రాగా...జనవరి 30 జరిగిన రెండు విడతల్లో ఒక్కో దాంట్లో మూడు నాలుగు వచ్చాయని నిపుణులు తెలిపారు. ఆ తొలగించిన సిలబస్‌ మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉంటుంది. అందువల్ల అడ్వాన్స్‌డ్‌ లక్ష్యంగా సిద్ధమయ్యే వారు మాత్రం తీసేసిన పాఠ్యాంశాలను కూడా చదువుతారని, వారికి ఇబ్బంది లేకున్నా మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రంలో ఎక్కువగా ఇస్తున్నారని జేఈఈ నిపుణులు ఉమాశంకర్‌, కృష్ణ చైతన్య తెలిపారు.

 



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.