జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఫిబ్రవరి 21 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ పి.వెంకటరమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 2023-24కు గాను ఆన్లైన్లో విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుం రూ.1000, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.750లను డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్లైన్ ఫ్రాంచైజీ కేంద్రాల్లో చెల్లించాలన్నారు. మార్చి 5న తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in లో సంప్రదించాలని పేర్కొన్నారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.