• facebook
  • whatsapp
  • telegram

Inter Exams: ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు కట్టుదిట్టం

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. ప్రయోగ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం కాగా, ఇవి ఫిబ్రవరి 20వ తేదీన ముగుయనున్నాయి. జనరల్, వోకేషనల్‌ విభాగాలకు సంబంధించి థియరీ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొత్తం 99 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 75,576 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 40,082 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన వారు 35,494 మంది ఉన్నట్టు వెల్లడించారు. 99 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 29 మంది కస్టోడియన్‌ అధికారులను నియమించినట్టు తెలిపారు. 18 స్టోరేజ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయా స్టోరేజి పాయింట్ల నుంచి పరీక్షా పత్రాల తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బందో బస్తు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు సంబంధించి అయిదేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులు నడపాలని, విద్యార్థులు హాల్‌ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగు నీరు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డీఐవో సి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి, డీఎస్‌ఈవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.