చొప్పదండి, న్యూస్టుడే: మండలంలోని రుక్మాపూర్ సైనిక బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు అంతర్జాలం ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక ప్రకారం ఆరోతరగతిలో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 1వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. మార్చి 6 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్, మార్చి 10న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంపికైన వారికి మిలిటరీ కోచింగ్తో కూడిన విద్యాభ్యాసం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్డబ్ల్యూఆర్ఎస్పీఎల్స్కూల్.జీవోవి.ఇన్ అనే వెబ్సైట్ను పరిశీలించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.