• facebook
  • whatsapp
  • telegram

Singareni posts: సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

* కనీసం మరో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని భట్టి సూచించారు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో కొత్తగా 317 ఉద్యోగాలను నేరుగా... మరో 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి 21న సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సంస్థలో కారుణ్య నియామకాల కింద కనీసం మరో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని భట్టి సూచించారు. వీటికోసం పరీక్షలు పారదర్శకంగా జరగాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కారుణ్య నియామకాల కింద ప్రస్తుతం పనిచేస్తూ విధులకు అనర్హత పొందిన వారికి కనీస వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సౌరవిద్యుత్‌ ప్లాంటును ఫిబ్రవరి 26న ప్రారంభించనున్నట్లు భట్టి చెప్పారు. మిగిలిన సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్‌లో సింగరేణి తరఫున అతిథిగృహం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. వేసవిలో విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలని సూచించారు. సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాదబీమా పథకాన్ని వర్తింపజేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకు వచ్చిందని వివరించారు. ఉప ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం సీఎండీ బలరాం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.