* ఓ కేంద్రంలో కనిపించని హాల్టికెట్ నంబర్లు
ఈనాడు, హైదరాబాద్: జెన్కో ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్, కెమిస్ట్ పరీక్షలో సిబ్బంది నిర్లక్ష్యంతో అభ్యర్థులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఉదయమే కేంద్రానికి వచ్చినవారికి జెన్కో ముచ్చెమటలు పట్టించింది. హైదరాబాద్లోని ఓ సెంటర్లో ఏకంగా 80 మందికి రూమ్ నంబర్ కేటాయించపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వరంగల్కు చెందిన డి.ఎస్.అరుణ్ జులై 14న జెన్కో పరీక్ష రాసేందుకు మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ఉండగా ఉదయం 10.30గంటలకు అక్కడికి చేరుకున్నారు. బోర్డులో తన హాల్టికెట్ నంబర్ కోసం వెతకగా కనిపించలేదు. తన ముందు, వెనకాల ఉన్న 80 మంది నంబర్లు లేవని అక్కడి పరీక్షల నిర్వహణ అధికారికి తెలిపారు. అయినా స్పందించలేదు. తర్వాత హెల్ప్డెస్క్ ద్వారా జెన్కో ఉన్నతాధికారిని సంప్రదించగా కాలేజీ వాళ్లే పరిష్కరిస్తారని చెప్పడంతో అక్కడే ఉన్నారు. హాల్టికెట్ నంబర్లు లేవంటూ ఆన్లైన్లో డిస్ప్లే బోర్డు ఫొటోలు వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో అయిదు నిమిషాల్లో పరీక్ష మొదలవుతుందనగా గది ఏర్పాటు కోసం ప్రయత్నించారు. అతికష్టం మీద అనేక గదులు మారిన తర్వాత పరీక్ష రాశానని అరుణ్ ‘ఈనాడు’కు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.