• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 

దేశ వ్యాప్తంగా ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ పరీక్ష వివరాలు:

* ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి. 

పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. పరీక్ష సమయం 2 గంటలు.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.2700. జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.2450. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1800. థర్డ్ జెండర్‌కు రూ.1800.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు తేదీలు: 16-04-2024 నుంచి 15-05-2024 వరకు.

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 16-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 17-05-2024 నుంచి 19-05-2024 వరకు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్‌: 02-07-2024.

పరీక్ష తేదీ: 06-07-2024.

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :