* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 11న విడుదలయ్యాయి. విజయవాడలో సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావు తదితరులు ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ను జేఎన్టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.
|
ఇంజినీరింగ్ |
అగ్రికల్చర్ & మెడికల్ |
ఏపీ ఈఏపీసెట్ మాక్ కౌన్సెలింగ్స్ - 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.