• facebook
  • whatsapp
  • telegram

CA exams: సీఏ పరీక్షలకు 4.35 లక్షలకు పైగా విద్యార్థుల హాజరు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే : దేశవ్యాప్తంగా మే 24న జరుగనున్న సీఏ పరీక్షలకు 4.35 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఐసీఏఐ కౌన్సిల్‌ మెంబర్‌ సీఏ రోహిత్‌ అగర్వాల్‌ వెల్లడించినట్లు మాస్టర్‌ మైండ్స్‌ విద్యాసంస్థల అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌ మార్చి 15న ఒక ప్రకటనలో తెలిపారు. సీఏ ఇన్‌స్టిట్యూట్‌ 75 ఏళ్ల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుందని అగర్వాల్‌ లింక్‌డిన్‌లో ఫోస్ట్‌ ద్వారా తెలిపారని చెప్పారు. ఇంత ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీఏ కోర్సు చదివే విద్యార్థులు పెరగడం వల్ల ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ తెలియజేస్తుందన్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌ సీఏకు అనువైన గ్రూపు అని, ఏ గ్రూపు వారైనా సీఏ కోర్సు చదవడానికి అర్హులని తెలిపారు. డిగ్రీ చదవిన విద్యార్థులు డైరెక్ట్‌ ఎంట్రీ ద్వారా కోర్సులో ప్రవేశం పొందవచ్చన్నారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.