ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల (డీఏవో)పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్, సీబీఆర్టీ విధానంలో రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.