* మొత్తం 200 సీట్ల భర్తీ
![]() |
ఈనాడు, హైదరాబాద్: ఉద్యాన డిప్లొమా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు సంవత్సరాల కోర్సులో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా, కొల్లాపూర్లలోని ప్రభుత్వం ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో, సూర్యాపేట గడ్డిపల్లిలోని గంటా గోపాలరెడ్డి, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లోని విశ్వధార ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో 40 చొప్పున సీట్లు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు 31.12.2024 నాటికి కనిష్ఠంగా 15 ఏళ్లు, గరిష్ఠంగా 22 ఏళ్ల వయసు ఉండాలి. జులై 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలిసెట్-2024లో వచ్చిన ర్యాంకును లేదా పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. 60 శాతం సీట్లను కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివినవారికి కేటాయిస్తారు. అన్ని కళాశాలల్లో హాస్టల్ సౌకర్యం ఉంది. మరిన్ని వివరాల కోసం ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9652456779, 8333981354 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.