* జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 28న రాత్రి సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం, ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.