* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను అనంతపురం జేఎన్టీయూలో గురువారం (మే 30) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మే 8న ఈ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలు గురువారం (మే 30) సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.