* సీబీఆర్టీ విధానంలో పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఆర్టీ) విధానంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులకు (మల్టీసెషన్స్) ఈ పరీక్షలు ఉంటాయని, నార్మలైజేషన్ విధానంలో మార్కుల లెక్కింపు ఉంటుందని కమిషన్ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఈడీ స్థాయిలో విద్యపై పేపర్-2 ఉంటుందని తెలిపింది. దివ్యాంగ వసతి గృహాల్లో పోస్టులకు పేపర్-2 పరీక్షలో డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ (దృష్టిలోపం, వినికిడి లోపం) సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. హాల్టికెట్పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్పోర్టు ఫొటో అంటించాలని, హాల్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఒరిజినల్) తీసుకురావాలని స్పష్టం చేసింది.
టీజీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.