• facebook
  • whatsapp
  • telegram

ITI : ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

* జులై 24లోగా దరఖాస్తులు నమోదు 
 

కంచరపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపల్‌ జె.శ్రీకాంత్‌ జూన్‌ 28న తెలిపారు. అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరాలనుకుంటున్నారో అదే ఐటీఐలో  జులై 24లోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ఎక్కడో ఒకచోట వారి ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. అటువంటి అభ్యర్థులే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. పరిశీలన చేయించుకోలేని వారి పేర్లు మెరిట్‌ జాబితాలో కనిపించవన్నారు. అభ్యర్థులు ఈ విషయంలో అశ్రద్ధ చేయరాదని తెలిపారు. జులై 27, 28 తేదీల్లో ప్రభుత్వ ఐటీఐలకు, 29, 30 తేదీల్లో ప్రైవేట్‌ ఐటీఐలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న ఐటీఐల్లో మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.