*అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటనకు అవకాశం
ఈనాడు-ప్రతిభ డెస్క్: తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ మంగళవారం (జులై 23న) అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్యాలెండర్ లో సుమారు 50 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా మార్చి 31 వరకు ప్రభుత్వంలో ఏర్పడిన ఖాళీలను గుర్తించి, నోటిఫికేషన్లు విడుదల చేసి, డిసెంబరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలు అందితే అసెంబ్లీలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?