1. రాధికా సేన్కు ఐరాస అవార్డు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2023)తో సత్కరించనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారత పర్వతారోహకుడు సత్యదీప్ ప్రపంచ రికార్డు!
భారత పర్వతారోహకుడు సత్యదీప్ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్లో అధిరోహించడంతోపాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఐరోపా దేశాలు
గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ ప్రకటించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. నాలుగో విడతలో అత్యధికం.. అయిదో దశలో అత్యల్పం
సార్వత్రిక సమరంలో ఇప్పటివరకు నాలుగో విడతలో అత్యధికంగా 69.16% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అయిదో విడతలో కేవలం 62.20% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రాత్రుల్లోనూ చల్లబడని మహానగరాలు!
పెరుగుతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచుతున్నాయని, దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఇవి చల్లబడటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (సీఎస్ఈ) తాజా నివేదిక తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.